Header Banner

YS Jagan: వైసీపీలో హై టెన్షన్! జగన్ పల్నాడు పర్యటన వేళ..

  Wed Jun 18, 2025 09:45        Politics

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాళ్లకు పర్యటనకు వస్తుండటంతో పల్నాడు జిల్లా లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు భద్రతా పరంగా ఆంక్షలు విధించారు. జగన్ కాన్వాయ్‌తో పాటు కేవలం వంద మందికే అనుమతి ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే, వైసీపీ నేతలు ఈ పరిమితులను పట్టించుకోకుండా జగన్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ ఈ పర్యటనలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

పోలీసులు ఈ ప్రాంతంలో ఉన్న ఇరుకు రోడ్లు, వీధుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రెంటపాళ్లలో "అమరావతి ద్రోహి జగన్" అనే ఫ్లెక్సీలు కనిపించడంతో అధికారులు వాటిని తొలగించారు. గతంలో పొదిలిలో జగన్ పర్యటన సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, వైసీపీ నేతలు జగన్ పర్యటనపై విధించిన ఆంక్షలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ తాడేపల్లి నుంచి గుంటూరు శివార్ల మీదుగా రెంటపాళ్ల చేరుకోనుండగా, ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

 

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

 

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

Praja Vedika: నేడు (18/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #JaganPalnaduTour #YSJagan #PalnaduTensions #RentapallaVisit #YSRJaganLive #SattenapalliNews #JaganWithPeople #YSRCPUpdates #PoliticalHeatAP #AmaravatiProtests